తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత
తలకొండపల్లి/నవోదయం, ఆగస్టు 20: తల్లోజు ఆచారి అన్న గారి పిలుపు మేరకు తుమ్మ జంగమ్మ కుటుంబానికి చేయూతగా 50 కేజీల బియ్యాన్ని సహాయంగా అందజేశారు.
తలకొండపల్లి గ్రామపంచాయతీ 9వ వార్డు బీజేపీ మెంబర్ తిరుమణి అనూష–రవి గౌడ్ కుటుంబ సభ్యులకు ఈ బియ్యాన్ని అందజేశారు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన తుమ్మ జంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, వారి దశదిన కార్యక్రమానికి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో పోతుగంటి మహేష్ ద్వారా విషయం తెలుసుకుని ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు.
కష్టకాలంలో బాధిత కుటుంబానికి తమ వంతు సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు తుమ్మ శీను, సీనియర్ నాయకులు శాంతకుమారి, కటుమల యాదయ్య, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
Telangana
తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత
Quick Summary:
తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత