25 రోజులుగా పైప్లైన్ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు
కౌన్సిలర్ శివ సూచనలు బేఖాతరు.. మెగా పైప్లైన్ పనుల్లో నిర్లక్ష్యం
కొత్త రోడ్డు తవ్వి వదిలేశారు.. అధికారుల తీరుపై కాలనీవాసుల మండిపాటు
నవోదయం/షాద్ నగర్,ఆగస్టు 19
షాద్నగర్ పట్టణంలోని 26వ వార్డు శరణ బసవప్ప, ఇంద్రనగర్ కాలనీల్లో మిషన్ భగీరథ పైప్లైన్ పనులు ప్రారంభమై 25 రోజులు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా వేసిన సీసీ రోడ్డును పైప్లైన్ కోసం తవ్వి అసంపూర్తిగా వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని స్థానికులు ఆరోపించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కౌన్సిలర్ ఎస్పీ శివ పలుమార్లు మెగా పైప్లైన్ నిర్వాహకులకు సూచించినా పట్టించుకోవడం లేదన్నారు. ఒకటి, రెండు రోజులు పనులు చేసి సిబ్బంది తిరిగి రాకపోవడంతో పరిస్థితి అలాగే ఉందని తెలిపారు. సత్యసాయి పాఠశాల, ఆయుష్ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన మార్గం కావడంతో విద్యార్థులు, రోగులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మెగా పైప్లైన్ నిర్వాహకులు, సంబంధిత అధికారులు స్పందించి పనులను వేగంగా పూర్తి చేసి తవ్విన రోడ్డును పునరుద్ధరించాలని కాలనీవాసులు కోరారు.
Telangana
25 రోజులుగా పైప్లైన్ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు
Quick Summary:
25 రోజులుగా పైప్లైన్ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు
