ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై జరిగిన దారుణ ఘటనను ఖండించిన TSSO రాష్ట్ర అధ్యక్షుడు M. లక్ష్మీ నివాస్
ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై జరిగిన దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.
నల్గొండలో ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటనను తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (TSSO) తీవ్రంగా ఖండిస్తోంది. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థల్లోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని TSSO రాష్ట్ర అధ్యక్షుడు M. లక్ష్మీ నివాస్అ న్నారు.
ప్రస్తుత విద్యా విధానంలో చదువు, మార్కులు, ర్యాంకులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ మానవతా విలువలు, సంస్కారం, క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవం వంటి విలువలను విద్యార్థులకు బోధించడంలో లోపాలు కనిపిస్తున్నాయని అన్నారు.
పాఠశాల స్థాయి నుంచే ప్రతి విద్యార్థికి చదువుతో పాటు మానవ విలువలు, మంచి ప్రవర్తన, బాధ్యత, గురువులను గౌరవించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని కోరారు. “మంచి మార్కులు సాధించడం మాత్రమే విద్య కాదు.. మంచి మనిషిగా ఎదగడమే అసలైన విద్య” అనే విషయాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాసంస్థల్లో నైతిక విలువలు, మానవతా విలువలు, క్రమశిక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (TSSO) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
Telangana
ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై జరిగిన దారుణ ఘటనను ఖండించిన TSSO రాష్ట్ర అధ్యక్షుడు M. లక్ష్మీ నివాస్
Quick Summary:
ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై జరిగిన దారుణ ఘటనను ఖండించిన TSSO రాష్ట్ర అధ్యక్షుడు M. లక్ష్మీ నివాస్