జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు
జడ్చర్ల/నవోదయం: ఆర్య సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది. మూడవ రోజు వేద విద్వాంసులు శ్రీ వేదసింధు యజ్ఞ బ్రహ్మ గారి సమక్షంలో పూర్ణాహుతి, శాంతి ప్రకరణ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యజ్ఞాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదం జరుగుతుందని, వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ శుద్ధికి యజ్ఞాలు ఉపయోగపడతాయని తెలిపారు. వర్షేష్టి యజ్ఞం ద్వారా వర్షాలు కురిసేలా ప్రకృతి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇంట్లో యజ్ఞం నిర్వహించడం ద్వారా సానుకూల వాతావరణం ఏర్పడి దుష్ప్రభావాల నుంచి రక్షణ పొందవచ్చని వివరించారు.
వేదాల అధ్యయనం ద్వారా దేశభక్తి, దైవభక్తి, మంచి నడవడిక, పరస్పర గౌరవం, స్నేహభావం వంటి సద్గుణాలు పెంపొందుతాయని వక్తలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వేద సంస్కృతిని ఆచరిస్తూ సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్య ప్రతినిధి సభ మంత్రి, వేదాలంకార్ విద్వాంసులు, ఆర్య ప్రతినిధి సభ తెలంగాణ ఉపాధ్యక్షులు బాది మీ శివకుమార్ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ఆర్య సమాజాల అధ్యక్షులు మచ్చ సుధాకర్, అమిస్తాపూర్ రాములు, రిటైర్డ్ ఎంఈఓ జయశంకర్, వేద విద్వాంసులు నరేందర్ జీ, రఘుత్తమాచారి, నరసయ్య జీ, లక్ష్మణ్ జీ పాల్గొన్నారు.
అలాగే జడ్చర్ల ఆర్య సమాజం అధ్యక్షులు గుబ్బ నరసింహులు, మంత్రి బక్క రాజేశ్వర్, కోశాధికారి బొడ్ల విజయకుమార్, ఉపమంత్రి డి. కృష్ణయ్య, బీచ్ని లవకుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ విజయలక్ష్మి, గుబ్బ అశోక్ ఆర్య తదితరులు పాల్గొన్నారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి మహాయజ్ఞాన్ని విజయవంతంగా ముగించారు.
Telangana
జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు
Quick Summary:
జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు