నవాబ్పేట్–యన్మంగండ్ల రోడ్డుకు మరమ్మతులు
బోనాల పండుగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు
నవాబ్పేట్: నవాబ్పేట్–యన్మంగండ్ల మధ్య మట్టిరోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించారు. బోనాల పండుగ సందర్భంగా ఈ మార్గంలో రాకపోకలు పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం రోడ్డు మరమ్మతు పనులుj చేపట్టారు.
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహ చారి, సర్పంచ్ గీతారాణి సుధాకర్ చారి, ఉపసర్పంచ్ హజహర్ అలీ వార్డు సభ్యులతో కలిసి రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి, రాకపోకలకు అనుకూలంగా ఉండేలా మరమ్మతులు చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో వర్షాల సమయంలో మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ముఖ్యంగా బోనాల ఉత్సవాలకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా రహదారిని సరిచేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యమే తమ పాలనకు ప్రధాన లక్ష్యమని, గ్రామంలో అవసరమైన చోట్ల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పండుగల సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు మరమ్మతులతో ప్రయాణికులకు కొంతమేర ఇబ్బందులు తగ్గనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మెండె శ్రీనివాస్, పుట్టి అంజయ్య, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
బోనాల పండుగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు
Quick Summary:
బోనాల పండుగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు